ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : విజయవాడలోని, (మంగళగిరి) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బూత్ మేనేజ్మెంట్ వర్క్ షాప్ శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ బూత్ మేనేజ్మెంట్ వర్క్ షాప్ శిక్షణ తరగతులకు నందికొట్కూరు బూత్ అబ్జర్వర్ & ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని మాట్లాడుతూ రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు బూత్ అబ్జర్వార్లకు శిక్షణ తరగతులు ప్రారంభించారని అన్నారు. తెలుగుదేశం పార్టీ గ్రామస్థాయిలో వార్డు స్థాయిలో బలోపేతం చేయాలని ఉద్దేశంతో పార్టీ నిర్వహించిందని ఈ శిక్షణ తరగతులు బూత్ అబ్జర్వర్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ శిక్షణ తరగతులు ద్వారా మేము ఎంతో నేర్చుకున్నామన్నారు. మేము కష్టపడి పని చేసి తెలుగుదేశం పార్టీ గెలిపి లక్ష్యంగా ధ్రుడా నిశ్చయంతో పనిచేస్తామని అన్నారు. గ్రామాల్లో ఉన్న బూతులకు తిరిగి అక్కడున్న సమస్యలను తెలుసుకొని పార్టీ దృష్టికి తీసుకొని పోయి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తామని అన్నారు. ముఖ్యమంత్రి నారా.చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేయుటకు మాకు ఎంతో సంతోషంగా ఉందని, పార్టీ మా సేవ గుర్తించి మాకు ఇచ్చిన బాధ్యతను పార్టీ గెలుపు కోసం, మేము ఎల్లప్పుడూ కష్టపడి పని చేస్తామని అన్నారు. ఈ బూత్ మేనేజ్మెంట్ వర్క్ షాప్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పార్వతమ్మ, పెరుగు.పురుషోత్తంరెడ్డి, శ్రీనివాసరావు, రమణ తదితరులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News