Friday, 31 July 2026 12:54:26 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

బాల్య వివాహ ర‌హిత స‌మాజ నిర్మాణానికి కృషిచేద్దాం

Date : 03 February 2026 12:30 AM Views : 110

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : పిల్ల‌ల బంగారు భ‌విష్య‌త్తుకు చేయీచేయీ కలపి బాల్య వివాహ ర‌హిత జిల్లాగా ఎన్‌టీఆర్ జిల్లాను తీర్చిదిద్ది, ఆద‌ర్శంగా నిల‌ప‌డంలో ప్ర‌తిఒక్క‌రూ చేయీచేయీ క‌ల‌పాల‌ని, పిల్ల‌ల‌కు బంగారు భ‌విష్య‌త్తు అందించేందుకు నిబ‌ద్ధ‌త‌తో కృషిచేయాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ అన్నారు. వాస‌వ్య మ‌హిళా మండ‌లి (వీఎంఎం) - బాల్య వివాహ విముక్తి ర‌థాన్ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సోమ‌వారం క‌లెక్ట‌రేట్‌లో జెండా ఊపి ప్రారంభించారు. బాల్య వివాహాల‌కు వ్య‌తిరేకంగా సంత‌కం చేసి విస్తృత ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ మాట్లాడుతూ సామాజిక బాధ్య‌త‌గా వాస‌వ్య మ‌హిళా మండ‌లి ఓ మంచి కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతోంద‌న్నారు. వ‌సుధైవ కుటుంబంలో భాగ‌మైన మనంద‌రం బాల్య వివాహాల వ‌ల్ల క‌లిగే దుష్ప‌రిణామాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించి, బాల్య వివాహాలు జ‌ర‌క్కుండా క‌లిసిక‌ట్టుగా కృషిచేయాల్సి ఉంద‌న్నారు. చ‌ట్టాల‌ను గౌర‌విస్తూ, నిబంధ‌న‌లు పాటిస్తూ బాల్య వివాహాల‌కు వ్య‌తిరేకంగా గ‌ళ‌మెత్తాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. ఈ ప్ర‌చార ర‌థం ద్వారా గ్రామీణ‌, ప‌ట్టణ ప్రాంతాల్లో బాల్య వివాహాల దుష్ప‌రిణామాలు, చ‌ట్టాలుపై అవ‌గాహ‌న క‌ల్పించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. చైల్డ్ హెల్ప్‌లైన్ (1098), ఉమెన్ హెల్ప్‌లైన్ (181) కూడా అందుబాటులో ఉన్నాయ‌ని.. ఎవ‌రైనా ఈ నంబ‌ర్ల‌కు ఫోన్ చేసి స‌మాచారం అందించ‌వ‌చ్చ‌న్నారు. ఈ ప్ర‌చార ర‌థం ద్వారా బాల్య వివాహాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతో పాటు ల‌క్ష మందికి పైగా ప్ర‌జ‌ల నుంచి సంత‌కాలు సేక‌రించాల‌ని, ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ వాస‌వ్య మ‌హిళా మండ‌లి బృందానికి సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో వాస‌వ్య మ‌హిళా మండ‌లి ప్రెసిడెంట్ డాక్టర్ బి.కీర్తి, ప్రాజెక్టు డైరెక్ట‌ర్ రామానుజ‌య‌, జిల్లా స్త్రీ & శిశు సంక్షేమ అధికారి రుక్సానా సుల్తానా బేగం, డీసీపీయూ ఎం.రాజేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: