Friday, 31 July 2026 02:48:02 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

తంగేడంచ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి

Date : 01 January 2026 09:39 AM Views : 203

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / జూపాడుబంగ్లా : జూపాడుబంగ్లా మండలంలోని, తంగేడంచ గ్రామంలో ఎన్టీఆర్ పింఛన్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పిక్కిలి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లక్ష్మణస్వామి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని అన్నీ గ్రామాల్లో పింఛన్లు పండగ వాతావరణం నెలకొందన్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సామాజిక పింఛన్లు ఒకరోజు ముందుగానే డిసెంబర్-31వ తేదీననే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఏడాది సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఉదయం నుండి సచివాలయ సిబ్బందితో లబ్ధిదారుల ఇళ్ల దగ్గరకు వెళ్ళి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, గొల్ల లక్ష్మీదేవికి, గ్రామంలోని లబ్ధిదారులకు ఈశ్వర్ రెడ్డి చేతులమీదుగా పింఛన్లు ఇవ్వడం జరిగింది. పిక్కిలి.శ్రీనివాసులు మాట్లాడుతూ ఇది ఊరురా పింఛన్ ల పంపిణీ పండుగలా కొనసాగిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు మేలు చేసే సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందన్నారు. తంగేడంచ గ్రామంలోని అవ్వ తాతలను పలకరించి, మీకు ప్రతి అవసరం తీర్చడానికి మన కూటమి ప్రభుత్వం ముందుందని భరోసా ఇచ్చారు. గ్రామంలో పర్యటించి సచివాలయ సిబ్బందితో కలిసి పింఛన్ దారులకు నగదు అందజేశారు. అంతేకాకుండా ప్రజలకు పింఛన్ ల గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వృద్ధులకు, వితంతువులకు- రూ.4 వేలు, వికలాంగులకు రూ. 6 వేలు ప్రకారం కూటమి ప్రభుత్వం మీ ఇంటిదగ్గరికే వెళ్లి ఇచ్చే విధంగా చేసిందన్నారు. కాబట్టి మీరందరూ తప్పకుండా సచివాలయ సిబ్బందికి సహకరించాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది ఏఎన్ఎం శ్వేత, వెల్ఫేర్ అసిస్టెంట్ సాయి కిరణ్, మహిళా పోలీస్ కారుణ్య, ఫీషరీస్ హనోకు, అగ్రికల్చర్ ప్రసన్న, ఆశ వర్కర్ రాములమ్మ,, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :