ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : లాభసాటిగా మార్చేందుకు రైతులకు మేలైన పశుగ్రాస విత్తనాలను 75 శాతం రాయితీతో రైతు సేవా కేంద్రాలు, పశువైద్య కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు పాములపాడు పశు వైద్యశాల డాక్టర్ పి.భాస్కర్ తెలిపారు. శుక్రవారం పాములపాడులోని, పశువైద్య కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో రైతులకు గడ్డి విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెటర్నరీ డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ ప్రస్తుతం స్థానికంగా ఎక్కువగా డిమాండ్ ఉన్న సిఎస్ హెచ్-24 జొన్న రకం, ఆఫ్రికన్ టాల్ మొక్కజొన్న విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. సిఎస్ హెచ్-24 జొన్న 5 కిలోల ప్యాకెట్ అసలు ధర రూ.460 కాగా, ప్రభుత్వం సబ్సిడీ రూ.345 పోను రైతు రూ. 115 చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. మొక్కజొన్న 5 కిలోల ప్యాకెట్ విలువ రూ.340 ఉండగా, రూ.255 సబ్సిడీ పోను రైతు రూ.85 చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. రైతు తమ పొలంలో కనీసం 10 శాతం మేర పశుగ్రాసాన్ని సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యశాల సిబ్బంది తిరుమలేశ్, కవిత, రైతులు పాల్గొన్నారు.
Admin
E Nivas News