Friday, 31 July 2026 04:54:37 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

వేంపెంటలో ఎన్టీఆర్ 30 వర్ధంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళులు అర్పించిన టిడిపి నాయకులు లక్ష్మీకాంతరెడ్డి, కంభం.మోహన్ గౌడ్

Date : 18 January 2026 08:16 PM Views : 203

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో సింగిల్ విండో చైర్మన్ లక్ష్మీకాంతరెడ్డి, టిడిపి మండల బీసీ సెల్ అధ్యక్షుడు కంభం.మోహన్ గౌడ్ ల ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి & యువ పురుషుడు నందమూరి తారక రామారావు 30 వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ఇతర టిడిపి నాయకులతో, కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేంపెంట సొసైటీ చైర్మన్ లక్ష్మీకాంతరెడ్డి, పాములపాడు మండల టిడిపి బీసీ సెల్ అధ్యక్షుడు కంభం.మోహన్ గౌడ్, తదితర నాయకులు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు సినిమాలలో యుగపురుషుడుగా, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడుగా అందరికీ సుపరిచితుడని అన్నారు. ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఒక ప్రభంజనం అని అన్నారు. ఆయన ఒక సంచలనం, తెలుగువాడి విశ్వరూపం. వెండితెరపై రారాజుగా వెలుగొందిన మహానటుడని అన్నారు. రాజకీయాల్లో కూడా మహానాయకుడిగా రాణించి, గొప్ప మెజారిటీతో ముఖ్యమంత్రిగా గెలుపొందడం జరిగిందన్నారు. ఎన్టీ రామారావు తెలుగుదనానికి ప్రతిరూపంగా నిలిచారని అన్నారు. ఆయన ఒక తెలుగుజాతి ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, ప్రజాసంక్షేమం అనే సిద్ధాంతాలపై తెలుగుదేశం పార్టీ నిర్మితమైందన్నారు. ఎన్టీ రామారావు సమాజమే దేవాలయం --ప్రజలే దేవుళ్లని నినదించిన గొప్ప వ్యక్తి అని అన్నారు. కోట్లాది హృదయాల్లో కొలువైన ఎన్టీఆర్ నాకు నిత్యస్ఫూర్తి, మనకందరికీ ఆదర్శప్రాయుడు అన్నారు. ఆయన అడుగుజాడలలో మనమందరం నడిచి ప్రజల కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మూల.లేనిన్ బాబు బాలస్వామి, శంకర్ రాముల నాయక్, చిన్నదరగయ్య, రామ్మోహన్ రెడ్డి, జనార్ధన్ నాయక్, స్వామినాయుడు గోపాలయ్య గొల్ల.బుజ్జి, బోయ.జనార్దన్, సామన్న నాయక్, డాక్టర్ నరసింహుడు, వెంకటరాముడు, రాంబాబు నాయక్, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :