Saturday, 13 June 2026 04:18:23 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

ఆత్మకూరు డిగ్రీ బాలికల వసతి గృహం వార్డెన్ పై చర్యలు తీసుకోండి

జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబరు లింగాల నాగరాజు

Date : 20 November 2025 10:14 PM Views : 1021

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు డిగ్రీ బాలికల వసతి గృహం వార్డెన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులకు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆత్మకూరులోని, డిగ్రీ బాలికల వసతి గృహాన్ని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్- ఎల్.నాగరాజు, ఎమ్మార్పీఎస్ నాయకులు కే.నాగన్న తో కలిసి సందర్శించి మాట్లాడుతూ సోమవారం మొదులుకొని శుక్రవారం వరకు రోజు ఉదయం ఉడకబెట్టిన కోడిగుడ్డు ఇవ్వాల్సి ఉన్న ఇవ్వకుండా పిల్లల నోర్లు కొడుతున్నారని ఆయన మండిపడ్డారు. పెరుగుకు బదులు పలచని మజ్జిగ పోస్తున్నారని పిల్లలు పలచటి చారు, పెరుగుకు బదులు పలచని మజ్జిగ పెడుతున్నారని, అది తినలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. మెనూ ప్రకారం ఆహారం ఏది సరిగ్గా ఇవ్వడం లేదని ఆయన అన్నారు. నాలుగు బాత్రూములు ఉంటే రెండు బాత్రూంలలో మాత్రమే నీరు వస్తుందని, 9 రూములలో ఒక్క రూములో మాత్రమే కరెంటు ఉందని, ఆ రూములోనే పిల్లలందరూ రాత్రివేళ నిద్రించడానికి సరైన సౌకర్యం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ వార్డెన్ మాత్రం ఏ ఒక్కరోజు కూడా హాస్టల్ కు రావడం లేదని ఆయన మండిపడ్డారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల బాగా చదువుకుంటారని తల్లిదండ్రులు తమ పిల్లలను హాస్టల్లో వదిలితే ఎవరు ప్రశ్నించరని వార్డెన్లు వాళ్ల ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. జిల్లాలో ఏ ఒక్క హాస్టల్లో పిల్లలకు సరైన భోజనం పెట్టకుండా, సరిగ్గా చూసుకోకపోయినా వార్డెన్లను వదిలే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. దీనిపై వెంటనే జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :