Wednesday, 01 April 2026 01:54:26 AM
# లక్షెట్టిపేటలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం.. # మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు # షెడ్యూల్డ్ కులముల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. # గ్రామ పంచాయతీలకు 247.94 కోట్ల నిధులు విడుదల... # అమెరికా సామ్రాజ్యవాద విధానాలు నశించాలి - ఇరాన్ పై యుద్ధం ఆపాలి... # నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్... # 14,15 సంవత్సరాల వయసు బాలికలు హెచ్ పి వి వ్యాక్సిన్ వేయించుకోవాలి.. # మే నుంచి తెలుగు రాష్ట్రాల్లో జనగణన ప్రక్రియ ప్రారంభం.. # లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎస్సై # మంచిర్యాలలో ప్రజాపాలన స్పెషల్ డ్రైవ్.... # బిజెపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కార్యవర్గ సభ్యులుగా చల్ల నారాయణరెడ్డి, చంద్రుపట్ల సునీల్ రెడ్డి # కాళేశ్వర దేవస్థాన డైరెక్టర్ గా బిసుల నర్సయ్య # కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు వచ్చింది... # తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల సస్పెన్షన్... # శ్రీ హిందూ కుటుంబీకులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.. # తెలంగాణ జాగృతి'లో భారీ చేరికలు... # ఉచిత కూరగాయల వి త్తనాలను రైతులు సద్విని యోగం చేసుకోవాలి # నేతకాని సమాజ అభ్యున్న తికి ఫౌండేషన్ ఏర్పాటు- # మహానంది అవార్డు అందుకున్నహనూష్ కుమార్... # జర్నలిస్టులు ఏప్రిల్ 6 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి...

ఆత్మకూరు డిగ్రీ బాలికల వసతి గృహం వార్డెన్ పై చర్యలు తీసుకోండి

జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబరు లింగాల నాగరాజు

Date : 20 November 2025 10:14 PM Views : 868

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు డిగ్రీ బాలికల వసతి గృహం వార్డెన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులకు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆత్మకూరులోని, డిగ్రీ బాలికల వసతి గృహాన్ని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్- ఎల్.నాగరాజు, ఎమ్మార్పీఎస్ నాయకులు కే.నాగన్న తో కలిసి సందర్శించి మాట్లాడుతూ సోమవారం మొదులుకొని శుక్రవారం వరకు రోజు ఉదయం ఉడకబెట్టిన కోడిగుడ్డు ఇవ్వాల్సి ఉన్న ఇవ్వకుండా పిల్లల నోర్లు కొడుతున్నారని ఆయన మండిపడ్డారు. పెరుగుకు బదులు పలచని మజ్జిగ పోస్తున్నారని పిల్లలు పలచటి చారు, పెరుగుకు బదులు పలచని మజ్జిగ పెడుతున్నారని, అది తినలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. మెనూ ప్రకారం ఆహారం ఏది సరిగ్గా ఇవ్వడం లేదని ఆయన అన్నారు. నాలుగు బాత్రూములు ఉంటే రెండు బాత్రూంలలో మాత్రమే నీరు వస్తుందని, 9 రూములలో ఒక్క రూములో మాత్రమే కరెంటు ఉందని, ఆ రూములోనే పిల్లలందరూ రాత్రివేళ నిద్రించడానికి సరైన సౌకర్యం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ వార్డెన్ మాత్రం ఏ ఒక్కరోజు కూడా హాస్టల్ కు రావడం లేదని ఆయన మండిపడ్డారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల బాగా చదువుకుంటారని తల్లిదండ్రులు తమ పిల్లలను హాస్టల్లో వదిలితే ఎవరు ప్రశ్నించరని వార్డెన్లు వాళ్ల ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. జిల్లాలో ఏ ఒక్క హాస్టల్లో పిల్లలకు సరైన భోజనం పెట్టకుండా, సరిగ్గా చూసుకోకపోయినా వార్డెన్లను వదిలే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. దీనిపై వెంటనే జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :